ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
జైనథ్లో అధికారులతో సమీక్ష
పీహెచ్సీలో కొవిడ్ వ్యాక్సినేషన్ పరిశీలన
జైనథ్, జూన్ 25 : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటి ప్రతి మొక్కనూ బతికించుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మండల కేంద్రంలో శుక్రవారం మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో నాటిన, వాటిలో బతికిన మొక్కల గురించి అడిగి తెలుసుకున్నారు. మండల స్థాయిలో శాఖాపరంగానే కాకుండా ఇతర శాఖల పరిధిలో ప్రజలకు పథకాలు అందేలా పనిచేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోనే జైనథ్ను ఉత్తమ మండలంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, పీఏసీఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
పీహెచ్సీలో వ్యాక్సినేషన్ పరిశీలన..
జైనథ్ పీహెచ్సీలో కొవిడ్ వ్యాక్సినేషన్ తీరును ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 57 రకాల దీర్ఘకాలిక వ్యాధులకు చితంగా పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ సేవలను వినియోంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట వైద్యులు శ్రీకాంత్, అనిత, వైద్య సిబ్బంది ఉన్నారు.