ఐదేళ్లకు ముందు.. స్మార్ట్ఫోన్లో ఒక నెల మొత్తం చాలా పొదుపుగా ఒక జీబీ, రెండు జీబీల డేటాను వాడుకునే వాళ్లం. ఒక్క జీబీ డేటా కోసం రీచార్జ్ చేయించాలంటేనే వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. కానీ.. ఎప్పుడైతే రిలయెన్స్ జియో.. టెలికాం రంగంలోకి అడుగుపెట్టిందో.. ఇక చూసుకోండి.. ఇంటర్నెట్ రంగంలోనే విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.
2016లో సరిగ్గా ఈరోజే అంటే సెప్టెంబర్ 5న జియో పురుడు పోసుకుంది. ఉచితంగా జియో సిమ్ అంటూ ఇండియాలోనే రికార్డ్ క్రియేట్ చేసింది. ఉచితంగా వాయిస్ కాల్స్, ఉచితంగా వాడుకున్నంత డేటా ఇచ్చిన జియో.. ఒక్కసారిగా టెలికాం రంగంలోనే కుదుపు కుదిపేసింది. జియో దెబ్బకు మిగితా టెలికాం కంపెనీలు అన్నీ మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏది ఏదైనా.. నేడు.. ఇంటర్నెట్ను ప్రతి ఇంటికి తీసుకెళ్లింది మాత్రం జియోనే. 4జీ స్పీడ్ డేటాను తక్కువ ధరకే అందించి టెక్నాలజీ రంగంలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. భారత్లో ఇంటర్నెట్ రివల్యూషన్కు ఆజ్యం పోసింది.
ట్రాయ్ లెక్కల ప్రకారం.. భారత్లో జూన్ 2021 వరకు.. మొబైల్, బ్రాడ్బ్యాండ్ వ్యవస్థలలో అత్యంత మార్కెట్ షేర్ను కలిగిన సంస్థగా జియో నిలిచింది. జియో ప్రారంభమై నేటికి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. జియో తన ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. సెలబ్రేటింగ్ 5 ఇయర్స్ ఆఫ్ జియో.. 5 ఇయర్స్ ఆఫ్ డిజిటల్ రివల్యూషన్.. ఈ ప్రయాణంలో మాతో కలిసి ఉన్నందుకు ధన్యవాదాలు.. అంటూ వీడియోను ట్వీట్ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Internet Apocalypse : ఇంటర్నెట్ యుగాంతం వచ్చేసినట్టేనా? దూసుకొస్తున్న భారీ సౌర తుఫానే కారణమా?
Dolby Atmos : డాల్బీ అట్మాస్ సౌండ్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?
అంతరిక్షంలోకి చీమలు, అవకాడోలు పంపిన స్పేస్ఎక్స్..!