ముంబై: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన జియో ఫోన్ వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పింది. కరోనా విపత్తు సమయంలో ఉచిత ఔట్గోయింగ్ కాల్స్ను అందించనున్నట్లు ప్రకటించింది. కరోనా విపత్తు ముగిసేవరకు నెలకు 300 నిమిషాల ఉచిత ఔట్గోయింగ్ కాల్స్(రోజుకు 10 నిమిషాలు) అందించడానికి రిలయన్స్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్నట్లు రిలయన్స్ జియో శుక్రవారం తెలిపింది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో రీఛార్జ్ చేయించుకోలేకపోయిన జియోఫోన్ వినియోగదారులకు ఈ పథకం అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉండటంతో వైరస్ వ్యాప్తి కట్టడి కోసం చాలా రాష్ట్రాలు లాక్డౌన్ లేదా పాక్షిక లాక్డౌన్ వంటి ఆంక్షలు విధించాయి. ఇలాంటి సమయంలో వినియోగదారులకు ఫ్రీ టాక్టైమ్ అందించిన మొట్టమొదటి సంస్థ రిలయన్స్ జియోనే.
నేను చనిపోతే ఎవరెవరు వస్తారో చూస్తా..! ఓ మహిళ డెత్ రిహార్సల్
టీకా తీసుకోండి.. రూ.7.35 కోట్ల జాక్పాట్ గెలుచుకోండి
స్వతంత్ర్య దేశంగా ఇజ్రాయెల్.. చరిత్రలో ఈరోజు
వ్యాక్సిన్ ఉత్పత్తికి భారత్ బయోటెక్తో చేతులు కలిపిన పీఎస్యూలు
విపత్తులో దోపిడీ అవకాశాన్ని వెతుక్కుంటున్న చైనా
దంతాలు బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే శుభ్రపరుచుకోవాలా..?
1100 ఏండ్ల నాటి పద్యం.. 18 వేల కోట్లు ముంచింది..!
సిద్ధమైన 2-డీజీ ఔషధం.. మొదట ఇచ్చేది ఎక్కడో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..