ప్రస్తుతం దేశమంతా జియోఫోన్ నెక్స్ట్ కోసం ఎదురు చూస్తోంది. ఎందుకంటే.. బడ్జెట్ ధరలో అది కూడా రూ.3500 కే స్మార్ట్ఫోన్ను అందివ్వడం అనేది ఇప్పటి వరకు ఏ బ్రాండ్లోనూ చూడలేదు. కానీ.. జియో నుంచి అద్భుతమైన ఫీచర్లతో కేవలం రూ.3500 కే జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్ఫోన్ను అందించనున్నారు. అందుకే.. మధ్యతరగతి ప్రజల చూపు జియోఫోన్ నెక్స్ట్ పై పడింది. ఇప్పటికే జియోఫోన్ను లాంచ్ చేసి సంచలనాలను సృష్టించిన జియో.. ఇటీవలే జియోఫోన్ నెక్స్ట్ను కూడా రిలీజ్ చేసింది.
ఈ ఫోన్ సేల్స్ దివాళీ కంటే ముందే ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో జియోఫోన్ నెక్స్ట్ ఫీచర్లను కంపెనీ తాజాగా విడుదల చేసింది. దానికి సంబంధించిన షార్ట్ వీడియో టీజర్ను జియో విడుదల చేసింది.
ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 215 ప్రాసెసర్, వాయిస్ అసిస్టెన్స్, రీడ్ అలౌడ్, ట్రాన్స్లేట్, 13 ఎంపీ రేర్ కెమెరా, ప్రీలోడెడ్ గూగుల్, జియో యాప్స్, మైక్రో యూఎస్బీ పోర్ట్, కెపాసిటివ్ టచ్ బటన్స్, రేర్ స్పీకర్స్ లాంటి బెస్ట్ ఫీచర్లతో జియోఫోన్ నెక్స్ట్ రిలీజ్ కానుంది.
జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్ఫోన్లను ఆంధ్ర ప్రదేశ్లోని తిరుపతిలో ఉన్న జియో యూనిట్లో అసెంబ్లింగ్ చేసినట్టు జియో తన వీడియోలో పేర్కొంది. గూగుల్ సహకారంతో జియో.. ఈ ఫోన్ను తయారు చేసిన విషయం తెలిసిందే.
Android 12 for iQoo : ఐక్యూ ఫోన్లలో ఆండ్రాయిడ్ 12 బీటా వర్షన్
Android 12 : ఆండ్రాయిడ్ 12లో బగ్.. గూగుల్ పిక్సెల్ ఫోన్లలో సమస్యలు
Amazon Sale : అమెజాన్ సేల్లో లాప్టాప్లపై బెస్ట్ డీల్స్ ఇవే
Redmi Note 11 : రెడ్మీ నోట్ 11 సిరీస్ ధర, స్పెసిఫికేషన్లు ఇవే.. రిలీజ్ డేట్ ఫిక్స్