ప్రస్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో నడుస్తున్నాయి. ఇప్పటికే ఆండ్రాయిడ్ తన ఆపరేటింగ్ సిస్టమ్లో పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ను కూడా తీసుకొస్తున్నట్టు గూగుల్ తాజాగా ప్రకటించింది.
ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్ను మార్కెట్లోకి తీసుకుస్తున్నట్టు గూగుల్ వెల్లడించింది. 2022లో రాబోయే ఎంట్రీ లేవల్ స్మార్ట్ఫోన్లను ఆండ్రాయిడ్ 12 ఓఎస్తో తీసుకురానున్నట్టు గూగుల్ తెలిపింది. ఇప్పటికే గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్ఫోన్లలో ఆండ్రాయిడ్ 12 ఓఎస్నే ఇన్స్టాల్ చేసింది.
ఆండ్రాయిడ్లో గో ఎడిషన్ అనేది లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఓఎస్కు ప్రస్తుతం 200 మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నట్టు గూగుల్ వెల్లడించింది.
ఈ ఓఎస్ ద్వారా గూగుల్ పలు సరికొత్త ఫీచర్లను తీసుకురానుంది. బ్యాటరీ లైఫ్ను పెంచడంతో పాటు స్టోరేజ్ కెపాసిటీ కూడా తక్కువగా వాడుకోనుంది. ప్రైవసీ పరంగా కొన్ని ఫీచర్లను ఈ ఓఎస్ ద్వారా తీసుకురానున్నారు. దానికోసం ఆండ్రాయిడ్ 12లో ప్రైవసీ డ్యాష్బోర్డ్ను గూగుల్ యాడ్ చేసింది. దానిలో.. ఏ యాప్.. లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్, ఇతర సెన్సిటివ్ డేటా పర్మిషన్ను తీసుకుంటుందో చెక్ చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
జియో బంపర్ ఆఫర్.. రూపాయితో రీచార్జ్ చేసుకుంటే చాలు.. 30 రోజుల వాలిడిటీ
Jobs in Mobile Tech | టెక్ నిపుణులకు కొలువులు ఫుల్.. పుంజుకుంటున్న మొబైల్ టెక్!
Top Trending Words | గూగుల్లో 2021లో ఎక్కువగా సెర్చ్ చేసింది దేని గురించో తెలుసా?
మీ పేరు మీద ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉంటే వెంటనే ఇలా చేయాల్సిందే.. లేదంటే అన్నీ బ్లాక్ అవుతాయి
Most Popular Tweets : 2021లో బాగా పాపులర్ అయిన ట్వీట్స్, హ్యాష్టాగ్స్ ఇవే