సంగారెడ్డి : చేపల వేటకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందాడు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి మండలంలోని గంజిగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. చాపల శివకుమార్(21) అనే యువకుడు గ్రామ సమీపంలోని చెరువుకు చేపల వేటకు వెళ్లాడు. కాగా చేపలు పడుతున్న క్రమంలో అతని కాళ్లు వలలో చిక్కుకున్నాయి. దీంతో నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయాడు.