పటాన్చెరు, అక్టోబర్ 26 : రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేశామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాం వద్ద రూ. 28లక్షల ఖర్చుతో నిర్మించిన ప్రహరీ గోడను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో రైతులను రాజులను చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. రైతు సంక్షేమమే మా ప్రధాన ఎజెండా అన్నారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణలోని రైతులు దుర్భిక్షమైన పరిస్థితిని చూశారన్నారు. ఎండిపోయిన పొలాలు, విద్యుత్ లేని మోటార్లు చూసేవారన్నారు.
ఇప్పుడు పచ్చటి పంటపొలాలు, 24గంటలు ఉచిత కరెంటును అందజేస్తున్నామని గుర్తు చేశారు. రైతుల సంక్షేమానికి రైతు బందు, రైతు బీమా కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చామన్నారు. రైతుల పంటలను దాచుకునేందుకు గోదాంలు అందుబాటులో ఉంచామన్నారు.
ముత్తంగి గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుంచేలా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక, వైస్ చైర్మన్ మల్లారెడ్డి, సర్పంచ్ ఉపేందర్ముదిరాజ్, ఉత్మ కమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, వైస్ ఎంపీపీ స్వప్న,
సింగిల్ విండో చైర్మన్ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభాకర్గుప్త, గడ్డ యాదయ్య, ఉప సర్పంచ్ లింగారెడ్డి, దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, మెరాజ్ఖాన్, సందీప్, రామకృష్ణముదిరాజ్, రవి తదితరులు పాల్గొన్నారు.