టేక్మాల్/ అల్లాదుర్గం, మే 5 : సీఎం కేసీఆర్ రైతు బాంధ వుడని… రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని.. కేంద్రం ధాన్యం కొనకున్నా.. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేస్తున్నని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన టేక్మాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యాసగిలో టేక్మాల్ మండలంలో సుమారు 6వేల ఎకారల విస్తీర్ణంలో వరి సాగు చేసినట్లుగా అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా గ్రామాల్లో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారు లకు సూచించారు. అకాల వర్షాలు ఉన్న కారణంగా రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొనుగోలు చేసిన వెంటనే ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించాలని సూచించారు.
షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన
రూ.27లక్షల నాబార్డ్ నిధులతో టేక్మాల్ ప్రాథమిక వ్యవసాయ సహకారం ఆధ్వర్యంలో నిర్మించనున్న షాపింగ్ కాం ప్లెక్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు, మహిళా సంఘాలకు స్వయం ఉపాధి రుణాల ను అందిస్తూ టేక్మాల్ సొసైటీ అద్భుతంగా పనిచేస్తుందన్నా రు. లాభాల బాటలో ఉన్న సొసైటీ షాపింగ్ కాంప్లెక్స్తో మ రింత ఆదాయాన్ని సమకూర్చుకుంటుందన్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న పెట్రోల్బంక్ను త్వరలో మంత్రి హరీశ్రావు ప్రారంభిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వప్నారవి, జడ్పీటీసీ సరోజ, సొసైటీ చైర్మన్ యశ్వంత్రెడ్డి, మార్కెట్ కమి టీ వైస్చైర్మన్ విక్రంగౌడ్, సర్పంచ్ సుప్రజాభాస్కర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాశ్, మాజీ జడ్పీటీసీ ముక్తార్, ఎంపీటీసీలు సురేందర్రెడ్డి, నారాయణరెడ్డి, మోహన్, పీఏసీఎస్ డైరక్టర్లు శ్రీనివాస్, శ్రీశైలం, కిషన్, చందర్, నేతలు గోవిందచారి, సిద్ధయ్య ఉన్నారు.
ప్రభుత్వ కేంద్రాల్లోనే మద్దతు ధర..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతుకు మద్దతు ధర లభి స్తుందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సూచించారు. అల్లాదుర్గం మండలంలోని రాంపూర్,అప్పాజిపల్లిలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఎమెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిల్కుమార్రెడ్డి, మాజీ ఎంపీపీ కాశీనాథ్, సర్పంచ్ భూలక్ష్మి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మ న్ దుర్గారెడ్డి, ఏపీఎమ్ నాగరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షు డు నర్సింహులు, సర్పంచ్లు అంజియాదవ్, బేతయ్య, రం జిత్, నాయకులు పవన్, బల్రాంరెడ్డి, పాల్గొన్నారు.