రామచంద్రాపురం, మే 30 : కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్స్ అందరికీ విడుతల వారీగా వ్యాక్సినేషన్ డ్రైవ్ని నిర్వహించనున్నట్లు గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం భెల్ ఆర్టీసీ డిపోలో ఉద్యోగులకు ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ డ్రైవ్ని డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వైద్య సిబ్బంది ఆర్టీసీ ఉద్యోగులు 153 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్రంలో 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం వ్యాక్సిన్ను వేస్తుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం వ్యాక్సిన్ వేయిస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ అంజయ్య, డిపో మేనేజర్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
పర్యవేక్షించిన అదనపు కలెక్టర్ రాజర్షి షా
ప్రభుత్వం శాఖల వారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసి టీకాలు వేయిస్తున్నారని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం సంగారెడ్డి ఆర్టీసీ డిపో ఆవరణలో ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం టీకా కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఉద్యోగి, కార్మికలకు టీకాలు చేయించడం సంతోషకరమన్నారు. ఆయన వెట ఆర్డీవో మెంచు నగేశ్గౌడ్, ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ ప్రభులత, డిపో మేనేజర్ నాగభూషణం, సీఐ నవీన కుమార్, సూపర్వైజర్స్, ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు.
ఆర్టీసీ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి
ఆర్టీసీ కార్మికులు వ్యాక్సిన్ వేయించుకోవాలని మెదక్ జిల్లా ఆర్టీసీ డిపో ఆర్ఎం రాజశేఖర్ అన్నారు. ఆదివారం మెదక్ బస్డిపోలో ఆర్టీసీ కార్మికులకు వేస్తున్న కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్స్ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులకు అవకాశం కల్పించినందుకు ఆర్టీసీ కార్మికులందరూ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని పేర్కొన్నారు. 130 మంది ఆర్టీసీ కార్మికులు కరోనా వ్యాక్సిన్ టీకా తీసుకున్నారన్నారు. ఆయన వెంట మెదక్ ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ ప్రణీత్, అసిస్టెటెంట్ మేనేజర్ ప్రవీన్, ఆర్టీసీ కార్మికులు ఉన్నారు.