నారాయణఖేడ్, కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్/కల్హేర్/సిర్గాపూర్, ఏప్రిల్ 19 : సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం కల్హేర్ మండలంలోని బీబీపేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రంతోపాటు పీఏసీఎస్ ప్రహరీ, సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. నారాయణఖేడ్ మండలంలోని సంజీవన్రావుపేట్, సిర్గాపూర్ మండలంలోని బొక్కస్గావ్, కడ్పల్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు. దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. కొనుగోలు కేంద్రాలను సద్వివినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ఏడీఏ కరుణకర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు నరేందర్రెడ్డి, వెంకట్రాములు, కల్హేర్, సిర్గాపూర్ జడ్పీటీసీలు నర్సింహారెడ్డి, రాఘవరెడ్డి, ఏవో శశాంక్, సిర్గాపూర్ ఎంపీపీ మైపాల్రెడ్డి పీఏసీఎస్ చైర్మన్లు గంగారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సంజీవన్రావు పేట్ సర్పంచ్ విఠల్, ఎంపీటీసీ భూపాల్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రవీందర్నాయక్, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు సాయిరెడ్డి, కల్హేర్ ఎంపీటీసీ సంగప్ప, ఉప సర్పంచ్ సాయిలు, నాయకులు బాలయ్య, నర్సింహాగౌడ్, కిష్టయ్య పాల్గొన్నారు.
వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట
ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నదని, అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి కాల్వల ద్వారా చెరువులు, కుంటలు నింపుతూ పంటపొలాలకు నీరందిస్తున్నదని రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని దౌల్తాబాద్, గోవిందరాజ్పల్లి, సిరిపుర, లింగాపూర్, చీక్మద్దూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంట దళారుల పాలుకాకుండా ఉండేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. అంతకుముందు మండలానికి మంజూరైన 130 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సింహులు, జడ్పీటీసీ ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్లు దామోదర్రెడ్డి, దుర్గారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, రైతు సమన్వయ సమితి సభ్యులు విఠల్రెడ్డి, బుచ్చిరెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
గోదావరి నాట్యమాడంగా.. జలవనరులు మురవంగా
అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ను గెలిపించండి
సీఎం కేసీఆర్కు కరోనా.. త్వరగా కోలుకుంటారని కేటీఆర్ ట్వీట్