గజ్వేల్అర్బన్, ఏప్రిల్19: గజ్వేల్ కెనాల్ నుంచి తరలివస్తున్న గోదావరి జలాలతో చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. గజ్వేల్ ఎర్రకుంట పూర్తిగా నిండి మత్తడి దుంకడంతో గజ్వేల్ పాండవుల చెరువులోకి గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయి. దశాబ్దం తర్వాత ఎర్రకుంట మత్తడి దుంకడంతో ప్రజలంతా చూడడానికి తరలివస్తున్నారు. గజ్వేల్ పట్టణంలోని ఎర్రకుంట పూర్తి నిండి మత్తడి దూకుతుండగా, ముట్రాజ్పల్లి పల్లి బర్రిచెరువు కూడా మత్తడి దుంకడానికి చేరువలో ఉన్నది. ప్రజ్ఞాపూర్ ఊర చెరువులోకి కూడా భారీగా గోదావరి జలాలు చేరడంతో ఊర చెరువు కూడా నిండి మధ్యాహ్నానానికి మత్తడి దుకంనున్నది.
వెల్దుర్తి, ఏప్రిల్ 19: హల్దీవాగులో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ మెదక్ జిల్లాలోని మంజీరా నది వైపు పరుగులు తీస్తున్నాయి. సోమవారం మండల పరిధిలోని కుకునూర్ చెక్డ్యామ్ నిండి మత్తడి దుంకింది. అక్కడి నుంచి గోదావరి జలాలు దామరంచ చెక్డ్యామ్ వైపు పయనిస్తున్నాయి. ఏటా ఎండకాలంలో నీళ్లు ఎండిపోయి ఎడారిని తలపించే హల్దీవాగులో, ఇప్పుడు నిండుకుండను తలపించేలా గోదావరి జలాలు ప్రవహిస్తుండడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వానకాలంలో భారీగా వర్షాలు కురిసినప్పుడే ఈ వాగులో నీళ్లు కనిపించేవని, అలాంటిది యాసంగి పంటలు చేతికి వచ్చి, కోతల సమయంలో వాగునిండుగా ప్రవహిస్తుండడంతో వానకాలం సాగును రోహిణీ కార్తెలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని రైతులు సంబురంగా చెబుతున్నారు. కలలో కూడా ఊహించని విధంగా హల్దీవాగుకు గోదావరి జలాలను తెచ్చిన సీఎం కేసీఆర్కు రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వారం రోజులుగా వెల్దుర్తి మండల పరిధిలో హల్దీవాగులో గోదావరి జలాలు ప్రవహిస్తుండగా, ఇప్పటి వరకు ఈ మండలంలో ఐదు చెక్డ్యామ్లు నిండాయి. మాసాయిపేట మండలంలో మరో చెక్డ్యాంతో పాటు హల్దీ ప్రాజెక్టు నిండి ప్రవహిస్తున్నది. జలాల్లో చేపలు సైతం కొట్టుకు వస్తుండడంతో మత్స్యకారులు వేటాడుతున్నారు. రైతులకే కాకుండా ఎంతోమంది కులవృత్తుల వారికి, పశుపక్ష్యాదులకు, అడవి జంతువులకు జలాలు వరంగా మారాయి. నేడు మండలంలోని దామరంచ, బతుకమ్మ బండ చెక్డ్యామ్లు నిండి అలుగులుపారి కొల్చారం మండలానికి గోదావరి జలాలు చేరే అవకాశం ఉంది.
మత్తడి వైపుగా సాగుతున్న చెరువులు, కుంటలు
గజ్వేల్అర్బన్, ఏప్రిల్19: గజ్వేల్ కెనాల్ నుంచి తరలివస్తున్న గోదావరి జలాలతో చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. గజ్వేల్ ఎర్రకుంట పూర్తిగా నిండి మత్తడి దుంకడంతో గజ్వేల్ పాండవుల చెరువులోకి గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయి. దశాబ్దం తర్వాత ఎర్రకుంట మత్తడి దుంకడంతో ప్రజలంతా చూడడానికి తరలివస్తున్నారు. గజ్వేల్ పట్టణంలోని ఎర్రకుంట పూర్తి నిండి మత్తడి దూకుతుండగా, ముట్రాజ్పల్లి పల్లి బర్రిచెరువు కూడా మత్తడి దుంకడానికి చేరువలో ఉన్నది. ప్రజ్ఞాపూర్ ఊర చెరువులోకి కూడా భారీగా గోదావరి జలాలు చేరడంతో ఊర చెరువు కూడా నిండి మధ్యాహ్నానానికి మత్తడి దుకంనున్నది.
ఎండల్లో ఏనాడు నీళ్లు చూడలేదు…
ఇన్నేండ్లళ్ల ఏనాడూ ఎండల్లో హల్దీడ్యామ్లో నీళ్లు చూడలేదు. ఎక్కడైనా ఎండకాలం వస్తే నీళ్లు ఎండిపోయి కనిపిస్తాయి. గిప్పుడు సీఎం సారూ గోదారి నీళ్లను వదలడంతో ఏనాడూ లేనట్లుగా వాగులో నీళ్లు పోతుండడం, హల్దీడ్యామ్ అలుగు పారడం సంతోషంగా ఉంది. – అంకం పర్వతాలు, రైతు, కొప్పులపల్లి (మెదక్ జిల్లా)
రైతుల పాలిట దేవుడు కేసీఆర్ సారు..
హల్దీవాగులో ఎండకాలంలో నీళ్లు పారడం సంతోషంగా ఉంది. వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న ఎంతోమంది రైతులకు సీఎం కేసీఆర్ దేవుడే. ఎప్పుడైనా ఎండకాలం వచ్చిందటే వాగులు ఎండిపోయి, బోర్లలో నీళ్లు తగ్గిపోయి, సాగుతో పాటు తాగునీళ్లకు ఇబ్బందిగా ఉండేది. కేసీఆర్ సారు దయతో గోదావరి నీళ్లతో మండుటెండల్లో వాగులు, చెక్డ్యామ్లు మత్తళ్లు దుంకడం ఆశ్చర్యంగా ఉంది.
14వ రోజూ గోదావరి పరవళ్లు
కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు పద్నాలుగో రోజూ సోమవారం పరుగులు తీశాయి. హల్దీవాగులోకి బిరబిరా వస్తున్న గోదావరి జలాలతో చెక్డ్యామ్లు నిండుతున్నాయి. 14వ రోజైన సోమవారం వెల్దుర్తి మండలంలో కుకునూరు చెక్డ్యామ్ నిండింది. కిలోమీటరున్నర మేర గోదావరి జలాలు ప్రవహించాయి. అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ ఈనెల 6న సిద్దిపేట జిల్లా అవుసులపల్లి వద్ద సంగారెడ్డి అప్టెక్ తూం వద్ద గోదావరి జలాలను వదిలిన సంగతి తెలిసిందే. నాలుగైదు రోజుల్లో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు చేరనున్నాయి. హల్దీవాగుపై 32 చెక్డ్యామ్లకు గాను 26 నిండాయి. మొత్తం నాలుగు చెరువులు నిండాయి.
ఇవీ కూడా చదవండి…
అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ను గెలిపించండి