న్యాల్కల్, ఏప్రిల్ 7 : నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా సంరక్షించాలని డీఆర్డీవో శ్రీనివాస్రావు అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. బుధవారం మండలంలోని గంగ్వార్, న్యా మతాబాద్ గ్రామాల్లో వైకుంఠధామం, డం పింగ్యార్డు, పల్లె ప్ర కృతి వనం, నర్సరీలో మొక్కల పెంపకం పనులను ఆయన పరిశీలించి సంతృప్తిని వ్య క్తం చేశారు. అనంతరం న్యాల్కల్ ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మం దిరంలో సంబంధిత శాఖాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ దృష్ట్యా కూలీలందరూ మాస్కులను ధరించి, భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలు పని చేసే ప్రదేశాలను గుర్తించి పనులు కల్పించాలన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని కూలీలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈజీఎస్లో భాగంగా రైతులు తమ పొలాల్లో కల్లాలను నిర్మించుకునే విధంగా చూడాలన్నారు. ఎండ తీవ్రత నుంచి నర్సరీలో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా గ్రీన్నెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి రోజు గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలించాలన్నారు. సమావేశంలో ఏపీడీ జయదేవ్, ఎంపీడీవో రాజశేఖర్, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్రావు, ఈజీఎస్ ఏపీవో రంగారావు, ఈసీ హన్మంతు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ…
ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా గుర్తించడం సంతోషకరం