ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
హన్మకొండ చౌరస్తా, ఏప్రిల్ 7: వరంగల్ను ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా గుర్తించడం సంతోషకరమని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బుధవారం హన్మకొండ పబ్లిక్గార్డెన్లోని గాం ధీ విగ్రహానికి పూలమాల వేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తె లిపారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడారు. వరంగల్ మహానగరంలో పర్యావరణ పరిరక్షణ కమిటీ సదస్సులు ఏర్పాటు చేసి ప్రతిరోజూ ప్రజలకు ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన కల్పించిన ఫలితంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరంగల్ను ప్లాస్టిక్ఫ్రీ నగరంగా గుర్తించాయన్నారు. ప్లాస్టిక్కు బ దులుగా పేపర్, జూట్ బ్యాగుల తయారీకి మహి ళా సంఘాల సహాయంతో ఇప్పటికే కొన్ని యూ నిట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిరుద్యోగ యువతకు పేపర్, జూట్ బ్యాగుల తయారీకి మరికొన్ని యూనిట్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం గుజరాత్లోని సూరత్తో పాటు వరంగల్ నగరాన్ని కూడా ప్ర తిపాదించారని, నాతో పాటు పలువురు పర్యావరణ ప్రేమికులు దశాబ్ధకాలంగా ప్లాస్టిక్పై పోరా టం చేస్తున్నామన్నారు.
ఐసీఎల్ఈఐ స్వ చ్ఛంద సంస్థ ప్లాస్టిక్ నిర్మూలన ప్రాజెక్టును వరంగల్ నగరంలో చేపట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. వరంగల్ ప్రాతిపదికనను కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా అమలు చేయాలని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి విన్నవించినట్లు చెప్పారు. ప్లాస్టిక్ రహిత నగరంగా చేస్తే కలిగే ప్రయోజనాలపై అవసరమైన డాక్యుమెంటేషన్ పూర్తి చేసి జీడబ్ల్యూఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.6 కోట్ల నిధులతో నగరంలో భారీ రీసైక్లింగ్ సెంటర్ను స్థాపించవచ్చన్నారు. ప్రాజెక్టు ద్వారా నగరంలో చెత్త ఏరుకుని జీవనం సాగిస్తున్న వారికి గుర్తింపుకార్డులతో పాటు గౌ రవ వేతనం కూడా అందించే అవకాశం ఉం టుందన్నారు. ప్లాస్టిక్ రహిత వరంగల్ నగరం కోసం కృషి చేస్తున్న మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. రతన్సింగ్, డాక్టర్ జగదీశ్వర్ప్రసాద్, వల్లంపట్ల నాగేశ్వర్రావు, శ్యాంసుందర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బెంగాల్ ఎన్నికల్లో ‘కూపన్ల పంపిణీ’ వివాదం
వ్యాక్సినేషన్పై కేంద్రం వైఖరిని తప్పుపట్టిన రాహుల్ గాంధీ