సంగారెడ్డి/ఆందోల్, ఏప్రిల్ 5: కేంద్రప్రభుత్వం ప్రతి ఏడాది జాతీయస్థాయిలో స్థానిక సంస్థలకు ఇచ్చే దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్ పురస్కార అవార్డు జిల్లాకు రావడం సంతోషకరమని మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, సీఈఓ ఎల్లయ్య, సిబ్బంది హైదరాబాద్లో మంత్రిని కలిసి వివరా లు వెల్లడించారు. జిల్లాకు జాతీయస్థాయి పురస్కారం సాధించిన జడ్పీ చైర్పర్సన్ను సన్మానించారు. జిల్లాకు స్థానిక సంస్థల పురస్కారం రావడం అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి ఫలితమేనని హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో జిల్లా పరిషత్ ముందుకు సాగాలని అకాంక్షించారు. జిల్లాకు మరి న్ని జాతీయ అవార్డులు సాధించాలని, ప్రజలకు అన్ని విధాలా ఉత్తమ సేవలు అందించేలా కృషిచేయాలని మంత్రి సూచించారు. మంత్రిని కలిసిన వారిలో నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, దేవేందర్రెడ్డి, జైపాల్రెడ్డి ఉన్నారు.
సన్మానించిన ఎంపీ…
జాతీయ స్థాయి దీన్దయాల్ పురస్కారానికి జిల్లా ఎంపిక కావడంతో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ దంపతులు జడ్పీ చైరపర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి దంపతులను సన్మానించారు. జిల్లా ఖ్యాతిని దేశానికే చాటి చెప్పారని కొనియాడారు.
ఇవీ కూడా చదవండి…
బాబూ జగ్జీవన్రామ్ సేవలు ఆదర్శనీయం