దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మాజీ ఉప ప్రధాని జయంతి వేడుకలు
సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, వైరా, కొణిజర్ల, ఏన్కూరు, కారేపల్లి, ఏప్రిల్ 5 : బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మంలోని తన స్వగృహంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. దేశానికి ఎంతో సేవలు చేశారని ప్రతి ఒక్కరూ ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కల్లూరు మేజర్ పంచాయతీ ఆవరణలో బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బాబూ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ఎనలేని సేవ చేసిన వ్యక్తి బాబూ జగ్జీవన్రామ్ దేశానికి ఉత్తమ మైన సేవలు అందించారని కొనియాడారు. సమరయోధుడు, తొలి ఉపప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు పెనుబల్లి, వీఎం బంజరులో ఆయన విగ్రహం వద్ద సోమవారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
వేంసూరు మండలంలోని గ్రామాల్లో, కార్యాలయాల్లో బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. వివక్షతను జయించిన భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ అని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే రాములునాయక్, రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ బాబూ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడని అన్నారు. మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను కొణిజర్ల టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏన్కూరులో బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగాయి. సోమవారం టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళుల అర్పించారు. కారేపల్లి మండల కేంద్రంలో జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
ఔరా..నోరా : రెడ్ డ్రెస్..రూ ౩ లక్షల విలువైన బ్యాగ్తో హల్చల్!
అద్భుత చరిత్రకు నాంది : ఎమ్మెల్సీ కవిత