మునిపల్లి : లారీలో అక్రమంగా తరలిస్తున్నరేషన్ బియ్యన్ని పక్క సమాచారంతో పట్టుకున్నమని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి మహారష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నట్లు సమచారం రావడంతో మునిపల్లి మండలం కంకోల్ టోల్ప్లాజా వద్ద లారీని పట్టుకున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటే శిక్షకు అర్హులవుతారని అన్నారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం అందజేసే బియ్యం పేద ప్రజలకు మాత్రమే అందలన్నారు. కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు సురేష్, షఫియోద్దిన్, శ్రీనివాస్, మానస, ఆర్ఐఓ రవీందర్రావు ఉన్నారు.