నారాయణఖేడ్: నారాయణఖేడ్ నియోజకవర్గంతోపాటు అందోల్ నియోజకవర్గంలోని రేగోడ్, వట్పల్లి మండలాల్లోని 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రతిపాదించిన బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.1774కోట్ల నిధులకు పరిపాలన అనుమతులిస్తూ గురువారం జీవోనెంబర్ 37ను జారీ చేసినట్లు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే సర్వేపనులు వేగవంతంగా జరుగుతుండగా, సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పనులను ప్రారంభించే దిశగా నిధులు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.