హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని మూడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదా దక్కింది. న్యాక్ గుర్తింపు ఆధారంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బోధన్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఖైరతాబాద్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ కరీంనగర్కు అటానమస్ హోదా కల్పిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కోదాడకు కూడా అటానమస్ హోదా దక్కాల్సి ఉన్నది. చిన్న కారణం చేత ఇది నిలిచినట్టు తెలిసింది.