పటాన్చెరు, జూలై 26 : పుట్టిన బిడ్డ నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని జీఎంఆర్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు మండలానికి చెందిన లబ్ధిదారులకు రేషన్కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పటాన్చెరు మండలానికి నూతనంగా మంజూరైన 757 రేషన్కార్డులు, రూ.కోటీ 12లక్షల విలువ గల 112 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మండలి చైర్మన్ భూపాల్రెడ్డి మాట్లాడారు. పేదవాడు ఆకలితో అలమటించి చనిపోకూడదనే ధృడ సంకల్పంతో టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులందరికీ రేషన్కార్డును మంజూరు చేసిందన్నారు. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోనే అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గానికి 2,222 రేషన్ కార్డులు మంజూరయ్యాయన్నారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్కార్డులు మంజూరు అయ్యేలా చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. పటాన్చెరు కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి, ఆర్డీవో నగేశ్, ఎంపీపీ సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, జడ్పీటీసీ సుప్రజా వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, సర్పంచులు సుధీర్రెడ్డి, ఉపేందర్, పోచయ్య, తహసీల్దార్ మహిపాల్రెడ్డి, నాయకులు మన్నేరాజు, వడ్డే కుమార్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.