మిర్యాలగూడ, మే 4 : పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. అయితే శనివారం మిర్యాలగూడ పట్టణంలోని కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో ఓటు వేసేందుకు కొందరు ఉపాధ్యాయుల వచ్చారు. లిస్టులో కొందరు ఉపాధ్యాయుల పేర్లు రాలేదు. దాంతో వారు నిరసన తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మొద టి విడుత ట్రైనింగ్లోనే తాము పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్నామన్నారు. కానీ తమ ఓట్లు మిస్ అయ్యాయని అధికారులు చెబుతున్నారని వివరించారు.
ఈ విషయాన్ని మిర్యాలగూడ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ శ్రీనివాస్రావు దృష్టికి తీసుకెళ్లగా ఈనెల 8 వరకు ఓటు వేసే అవకాశం ఉందని, విచారణ చేసి పేర్లు మిస్ అయినా వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇస్తామని తెలిపారు. అయితే ఓటు వేసే అవకాశం ఇవ్వకుంటే తాము నేరుగా పోలింగ్ బూత్ల్లో ఓటు వేసేందుకు ప్రాధాన్యమిస్తామని ఉపాధ్యాయులు సైదిరెడ్డి, వేణుధర్, ఉమాకర్రెడ్డి, ఇందిరా, కోటిరెడ్డి చెప్పారు.