మేడ్చల్, మే 4: కాంగ్రెస్ పాలనలో అన్నీ బందవుతున్నాయని, బీఆర్ఎస్ అమల్లోకి తెచ్చిన ఏ పథకం అమలు కావడం లేదని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మే డ్చల్ పట్టణంలోని వివేకానంద చౌరస్తా వద్ద శనివారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచా ర సభలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ కిట్ బందయ్యిందని, కల్యాణ లక్ష్మి రావడం లేదని, రైతు బంద్ ఇస్తలేరన్నారు.
ప్రజలు కాంగ్రెస్కు ఎందుకు ఓట్లు వేశామా? అని బాధపడే పరిస్థితి కేవలం నాలుగైదు నెలల్లోనే వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీ ఎం రేవంత్ రెడ్డి అమలుకు సాధ్యం కాని హా మీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోని వచ్చాక కాలయాపన చేయడమే తప్పించి, చేసిందేమీ లేదన్నారు. ఆడ బిడ్డలకు రూ.2500 రావడంలేదని, కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష, తులం బంగారం ఇవ్వ డం లేదన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయని కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. మరోసారి కాంగ్రెస్ను నమ్మి మోసపోవొద్దన్నారు. ప్రజలు ఆలోచిం చి ఓటు వేయాలన్నారు.