కల్హేర్, అక్టోబర్ 13 : అప్పుల ఊబిలో కూరుకుపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కష్ట కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఆదుకుంటుందని లబ్ధిపొందుతున్న బాధితులు కొనియాడుతున్నారని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం ఖానాపూర్ కేలోని ఎమ్మెల్యే నివాస గృహంలో కృష్ణాపూర్ గ్రామానికి చెందిన సాదక్ అలీ కొన్ని నెలల క్రితం కరోనా మహమ్మరితో మృతి చెందాడు.
మృతుడి కుమారుడు ఖాజా మొహినుద్దిన్కు రూ.48 వేయిలు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు. కార్యక్రమంలో కృష్ణాపూర్ సర్పంచ్ కిష్టారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాంరెడ్డి, నాయకులు అంజయ్య, దాడే పండరి, బాల్రాజ్ ఉన్నారు.