మాస్కులు ధరిస్తేనే బయటకు రావాలి
హన్వాడ, మే 4 : కరోనా నివారణ కోసం మండలంలో ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. వేపూర్, నాయినోనిపల్లి, హన్వాడ, ఇబ్రహింబాద్, మునిమోక్షం గ్రామాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతుండటతంతో ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. వార్డు వార్డు తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే మురుగు కాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. ప్రధానంగా కరోనా వచ్చిన వారి ఇంటి చుట్టూ ప్రత్యేక చర్యలు చేపట్టి వారికి సూచనలు, సలహాలతోపాటు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆయా గ్రామాల సర్పంచులు కరోనా బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించని వారికి రూ.1000 జరిమానా విధిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.