కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ సుశీల
రాజాపూర్,ఏప్రిల్ 16 : పేదల సంక్షేమానికి ప్రభు త్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నదని డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ సుశీల అన్నారు. శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలో 22మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.లక్షా 116 అందించి అండగా నిలుస్తున్నారన్నా రు. అలాగే పేదల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. అర్హులందరూ సంక్షేమ పథకాల ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మండలకేంద్రంలో ఇటీవల విద్యుదాఘాతంతో మృతి చెందిన హన్మగళ్ల కృష్ణయ్య కుటుంబానికి విద్యు త్ శాఖ ఆధ్వర్యంలో రూ.5లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మోహన్నాయక్, తాసిల్దార్ శంకర్, వైస్ఎంపీపీ మహిపాల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహు లు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, ఎంపీటీసీలు అభిమన్యురెడ్డి, శేఖర్గౌడ్, ఆనంద్గౌడ్, నరహరి, మహిపాల్రెడ్డి, యాదగిరి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
నవజాత శిశువు కరోనా.. చికిత్స పొందుతూ మృతి
టీఎస్ ఎడ్సెట్ నోటిఫికేషేన్ విడుదల