సమీక్షా సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి
సిద్దిపేట టౌన్/ మెదక్, జూలై 31 : తరుచూ నేరాలకు పాల్పడే నేరస్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. పెండింగ్ కేసులు, ఫంక్షనల్ వర్టికల్ తదితర అంశాలపై శనివారం వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, కేసుల్లో శిక్షల శాతాలను పెంచాలని సూచించారు. కోర్డు డ్యూటీ అధికారులకు తరుచూ శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. క్రైమ్ అగెనెస్ట్ వూమెన్ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిశోధన పూర్తిచేసి ఛార్జ్షీట్ వేయాలన్నారు. దేశ స్థాయిలో ఉత్తమ స్టేషన్లను ఎంపిక చేయడం జరుగుతుందని, ప్రతి యూనిట్ అధికారి జిల్లా నుంచి ప్రపోజల్ పంపించాలని సూచించారు. గంజాయి, జూదం, గుట్కా ప్రభుత్వ నిషేధించిన వీటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిర్మూలించాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి దరఖాస్తుదారుడితో మర్యాదగా మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామనే భరోసా కల్పించాలన్నారు. కరుడు గట్టిన, తరుచూ నేరాలకు పాల్పడే నేరస్తులపై పీడీ యాక్డు అమలు చేయాలని ఆదేశించారు. సిద్దిపేట జిల్లా పోలీసుల పనితీరు బాగుందని అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్లో పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్, అడిషనల్ డీసీపీ శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీలు మహేందర్, నారాయణ, ఏసీపీ సైదులు, మెదక్లో ఎస్పీ చందనదీప్తి, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి, తూప్రాన్ డీఎస్పీ కిరణ్కుమార్, డీసీఆర్బీ సీఐ సునీల్, జిల్లాలోని సీఐలు పాల్గొన్నారు.