కడ్తాల్, మే 2: గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి, గిరిజనుల కలను సాకారం చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గురువారం మండల కేంద్రంలో నాగర్కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్ధతుగా గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ.. .తండాలకు రూ.వేల కోట్లతో బీటీ రోడ్లు, అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా మార్చడం జరిగిందని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలన్నారు. ప్రశ్నించే గొంతుక, విద్యావంతుడైన ఆర్ఎస్పీని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అంతకుముందు బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, మంజుల, పీఏసీఎస్ డైరెక్టర్ సేవ్యానాయక్, మాజీ సర్పంచ్లు హరిచంద్నాయక్, లోకేశ్నాయక్, లక్ష్మీనర్సింహారెడ్డి, నాయకులు పంతూనాయక్, రమేశ్నాయక్, సాయిలు, హర్యానాయక్, పాండునాయక్, రాములునాయక్, గిరిజనులు పాల్గొన్నారు.