కందుకూరు, డిసెంబర్ 12 : టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం యువకులు కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కందుకూరు మండల పరిధిలోని అన్నోజిగూడ గ్రామానికి గొర్రెంకల రామక్రిష్ణను మండల టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ నియామకపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి పార్టీని ప్రజల్లోకి తీసుకవెళ్లాలని కోరారు. పార్టీలో పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Medaram | ఇక కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే వనదేవతల దర్శనం
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణకు ప్రభుత్వం కృషి : మంత్రి హరీశ్రావు
చప్పట్లతో కరెంట్ మోటర్ ఆన్, ఆఫ్..నాగర్కర్నూల్ యువకుడి ప్రతిభ