షాద్నగర్ : ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన షాద్నగర్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన శ్రావణ్ (24) అనే యువకుడు అయ్యప్ప కాలనీలో నివాసం ఉంటూ స్థానిక ఐరన్ పరిశ్రమలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తుండే వాడు.
ఎప్పటిలాగే ఇంట్లో నుంచి వెళ్లిన శ్రావణ్ ఇంటికి తిరిగి రాలేదు. పట్టణంలోని మహారాజ దాబ వెనుకాల ఉన్న ఓ చెట్టుకు శ్రావణ్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు గుర్తించారు. వ్యక్తిగత కారణాలతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.