మిడ్జిల్, ఏప్రిల్ 23 : అమలుకాని హామీలతో.. వ్య క్తిగత విమర్శలతో పాలనను గాలికొదిలేసిన మోసకారి కాంగ్రెస్ను ప్రజలు తరమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉ న్నాయని, ఎంపీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీ ఆర్ఎస్ పాలమూరు జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పి లుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో ఏ వీఎస్ గార్డెన్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కొత్తగా వచ్చిన సర్వే ప్రకారం 10 నుంచి 12 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయలన్నారు. ఈనెల 26న మ హబుబ్నగర్లో గులాబీ బాస్ కేసీఆర్ రోడ్ షోకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీపీ సుదర్శన్, నాయకులు సుధాబాల్రెడ్డి, జంగిరెడ్డి, జైపాల్రెడ్డి, బాలు, శ్రీనివాస్గౌ డ్, ఎల్లయ్యయాదవ్, ప్రతాప్రెడ్డి, శ్రీనివాసులు, బం గారు, బీమ్రాజు, సుకుమార్, మల్లేశ్, నవీనాచారి, జగన్గౌడ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రజలను నమ్మించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిం ది. బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన రైతుబంధుకు ఎగనామం పెట్టింది. అంతేకాకుండా రైతులు అరిగోస పడుతుంటే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఆగస్టులో రుణమాఫీ చేస్తామని మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వందరోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి నిలువునా ముంచారు. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా ఇలా అన్ని విధాలా అండగా నిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కరువు తెచ్చారు. పదేండ్లు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు చేసిందేమీ లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరించి గెలిపించాలి.