విద్యావ్యవస్థ సమగ్ర సమాచారాన్ని ఒకేచోట నిక్షిప్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం యూ డైస్ ప్లస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్)వెబ్సైట్ను రూపొందించింది. దీంతో ఇకపై ఒక్క క్లిక్తో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పూర్తి సమాచారమంతా వెబ్సైట్లో ప్రత్యక్షం కానున్నది. పాఠశాలల స్థితిగతులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమాచారంతోపాటు మౌలిక వసతులు ఏ పాఠశాలలో ఎలా ఉన్నాయో.
ఎంతమంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారో అనే విషయాలు స్పష్టంగా తెలియనున్నాయి. కాగా జిల్లాలోనూ విద్యాశాఖ అధికారులు ఈ దిశగా చర్యలను ముమ్మరం చేశారు. 1 నుంచి 12 తరగతుల వరకు మొత్తం విద్యార్థులతోపాటు ఉపాధ్యాయుల సమాచారాన్ని కూడా వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా జిల్లాలో ఉన్న 3,126 పాఠశాలల సమాచారాన్ని సేకరించి అందుబాటులోకి తీసుకురానున్నారు.
రంగారెడ్డి, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘విద్యా వ్యవస్థ సమగ్ర సమాచారాన్ని ఒకే చోట నిక్షిప్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ‘యూ డైస్ ప్లస్’ వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఇకపై ఒక్క క్లిక్తో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పూర్తి సమాచారం వెబ్సైట్లో ప్రత్యక్షం కానున్నది.
రంగారెడ్డి జిల్లాలోనూ విద్యాశాఖ అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టారు. 1 నుంచి 12 తరగతుల వరకు సమస్త విద్యార్థులతోపాటు ఉపాధ్యాయుల సమాచారాన్ని సేకరించి వెబ్సైట్లో నమోదు చేస్తున్నా రు. ఈ నెలాఖరు లోపు జిల్లాలో ఉన్న 3,126 పాఠశాలల సమాచారం అంతా వెబ్సైట్లోకి అధికారులు అందుబాటులోకి తేనున్నారు. దీం తో విద్యార్థులకు ఇకపై ప్రభుత్వ పరంగా అం దించే వసతులు, సదుపాయాల్లో పారదర్శకత పెరగనున్నది.’
2021-22 వరకు యూడైస్గా కొనసాగగా.. గత విద్యా సంవత్సరం నుంచి యూడైస్ ప్లస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్)గా నవీకరించారు. గతంలో ఏడాదికోసారి సమాచారం అప్డేట్ చేయగా ఇకపై మూడు గంటలకోసారి సాంకేతికత ఆధారంగా సమాచారాన్ని అప్డేట్ చేయనున్నారు. పాఠశాల మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మాడ్యుల్స్గా వెబ్సైట్ను మూడు భాగాలుగా విభజించి సమాచారం నిక్షిప్తం చేస్తున్నారు. ఎంఈవోలు, హెచ్ఎంల నేతృత్వంలో ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నెలాఖరు వరకు అంశాల వారీగా వెబ్సైట్లో వివరాలను అప్లోడ్ చేస్తున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పోరేటు విద్యా సంస్థల్లో కేజీ నుంచి ఇంటర్ వరకు చదువుకుంటున్న ప్రతి విద్యార్థి వివరాలు వెబ్సైట్లో పొం దుపరుస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలు ఉండగా.. ప్ర స్తుత సమాచారంతో అప్డేట్ చేస్తున్నారు. అలా గే పాఠశాలల్లోని తరగతి గదులు, మరుగుదొడ్లు, వంట గదులు, తాగునీరు తదితర సదుపాయాల వివరాలతోపాటు వాటి స్థితిగతులపై తాజా సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. ఈ ప్రక్రియపై ఇప్పటికే జిల్లాలో శిక్షణ సైతం పూర్తి కాగా.. చాలా వరకు పాఠశాలల్లో వేగవంతంగా సాగుతున్నది. ఉన్నతాధికారులు స్వయంగా పాఠశాలలకు వెళ్లి నమోదు ప్రక్రియను పరిశీలిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ పరం గా అందుతున్న వసతుల కల్పనకు యూడైస్ ప్లస్లోని వివరాలు కీలకం కానున్నాయి. అవినీతికి పాల్పడకుండా ఈ విధానం ఉపయోగపడనున్నది. వెబ్సైట్లో నమోదైన విద్యార్థులకే ఇకపై యూనిఫాం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు తదితర వాటిని అందించనున్నా రు. అన్ని పాఠశాలల సమాచారాన్ని సైతం వెబ్సైట్లో ఉండడంతో ఇక నుంచి ఆ వివరాల ఆధారంగానే పాఠశాలల్లో వసతుల కల్పనకు ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు కానున్నాయి.