ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆయన సతీమణి ముకుందమ్మలు శనివారం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది కూడా యాదాద్రీశుడి కృపతో సమృద్ధిగా వర్షాలు కురిసి సకల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరువతో లక్ష్మీనర్సింహస్వామి ఆలయం పూర్తికానుండటం సంతోషకరమన్నారు.