పరిగి, మే 6: బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపుల్లో మహిళలు ముందున్నా రని, 97శాతం సజావుగా చెల్లిస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. అందువల్లే స్వయం సహాయక సంఘాలకు రుణ పరిమితి పెంచేందుకు బ్యాంకర్లు సైతం ముందుకు వస్తున్నారని చెప్పారు. శుక్రవారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశపు హాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు సబ్సిడీపై సీలింగ్ ఫ్యాన్ లను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణాలు సద్వినియోగం చేసుకొని వ్యాపారాభివృద్దితోపాటు ఆర్థికంగా మహిళలు ఎదుగుతున్నారని చెప్పారు. మరింత ఆర్థిక ప్రగతి సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ప్రభుత్వం ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా స్వయం సహాయక సంఘాలు ఆర్థిక ప్రగతి సాధించేందుకు కృషి చేస్తుందన్నారు. మొదటి విడుతలో 500 సీలింగ్ ఫ్యాన్లు సబ్సిడీపై అందజేస్తున్నారని, రెండోవిడుతలో మరింత మందికి అంద జేయనున్నారని చెప్పారు. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి మాట్లాడుతూ రుణాల చెల్లింపుల్లో ఇతరులకు ఆదర్శంగా మహిళలు ఉన్నారని ఆయన కొనియాడారు. ప్రభు త్వం సైతం మహిళా సంఘాల అభివృద్ధికి సహకరిస్తుందని తెలిపారు. అంతకుముందు పరిగిలోని బాలికల ఉన్నత పాఠశాలలో నెస్ట్లే ఇండియా లిమిటెడ్ సహకారంతో ఏర్పాటు చేసిన మూడు మరుగుదొడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీలు కర ణం అరవిందరావు, అనసూజ, మల్లేశం, సత్యమ్మ, జడ్పీటీసీలు బి.హరిప్రియ, మలిపెద్ది మేఘమాల, రాందాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, ఎంపీడీవో శేషగిరిశర్మ, రైతుబంధు సమితి కులకచర్ల మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, ఐకేపీ ఏపీవోలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
పరిగి నియోజకవర్గంలోని పరిగి పట్టణంలో 4, పరిగి మండలం 9, దోమ 12, కులకచర్ల 9, పూడూరు 8, గండీడ్ మండలంలో 10 మంది, నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 58 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.19.96లక్షలకు సంబంధించిన చెక్కులు, ఒకరికి రూ.1.50లక్షలకు సంబంధించిన ఎల్వోసీని శుక్రవారం పరిగిలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అందజేశారు.
అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ…
పరిగి మండల పరిధిలోని రంగంపల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అం బేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శుక్రవారం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి భూమిపూజ నిర్వహించారు. అనంతరం మండల పరిధిలోని కాళ్లాపూర్ గ్రామంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.కార్యక్రమాలలో ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.