పెద్దఅంబర్పేట, జూన్ 7 : డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నది. మరో ఇద్దరు క్షతగాత్రులు అయ్యేందుకు కారణమైంది. ఈ ఘటన విజయవాడ జాతీయరహదారిపై అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.
సీఐ వాసం స్వామి కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన నితిన్ చౌదరి మాదాపూర్ కాకతీయహిల్స్లో నివాసం ఉంటున్నాడు. తండ్రి శివరామకృష్ణ, తల్లి సత్యవర్ధిని (50)తో కలిసి పెండ్లి పత్రికలు ఇచ్చేందుకు విజయవాడ నుంచి హైదరాబాద్కు కారులో బయలుదేరారు.
అబ్దుల్లాపూర్మెట్ సమీపంలోని బ్రిలియంట్ కాలేజీ కమాన్ దగ్గరకు రాగానే.. వెనుకనుంచి అతివేగంగా,అజాగ్రత్తగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ముందువెళ్తున్న కారును ఢీకొట్టింది. కారు అదుపు తప్పి డివైడర్పై ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టగా.. వెనుక సీట్లో కూర్చున్న శివరామకృష్ణ, సత్యవర్ధినికి తీవ్రగాయాలయ్యాయి.
వెంటనే అంబులెన్సులో వీరిని స్థానిక దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ సత్యవర్ధిని మృతిచెందింది. నితిన్ చౌదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ స్వామి తెలిపారు.