Woman Arrest | పరిగి, జులై 06 : వరుస దోపిడీలకు పాల్పడుతున్న పరిగి తుంకులగడ్డకు చెందిన కావలి అనంతమ్మ అనే మహిళను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పరిగి ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు. పరిగి బస్టాండ్ నందు వరుస దొంగతనాలు జరుగుతున్న సందర్భంగా పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ దృష్టి సారించారు. శనివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఒక వృద్ధ మహిళ పరిగి బస్టాండులో బస్సు ఎక్కుతున్న క్రమంలో గుర్తుతెలియని దొంగలు ఆమె మెడలో బంగారు గొలుసును దొంగలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ సీసీ కెమెరాల దృశ్యాలను గుర్తించి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆమె దగ్గర నుంచి 16 బంగారు పత్తిలు, ఒక పుస్తెను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు గత ఏప్రిల్ నెలలో కొడంగల్ బస్టాండ్ నందు దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన ఆమె మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. పోలీసులు బాధితురాలిని విచారించగా గతంలో సైతం పరిగి బస్టాండ్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నది. కావున నిందితురాలిపై హిస్టరీ సీట్ ఓపెన్ చేసి కోర్టులో హాజరు పరిచి నిఘా పెట్టనున్నట్లు ఎస్సై సంతోష్ కుమార్ పేర్కొన్నారు.