ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వాహనదారులు రోడ్డు నియమాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. ఆర్టీసీ వాహనాలు నిలిచే జంక్షన్లలో ప్రైవేటు ప్యాసింజర్ వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని.. సురక్షితంగా గమ్యాలకు చేర్చాలని పేర్కొన్నారు. ఆర్టీఏ అధికారులు నిరంతరం వాహనాలపై నిఘా పెట్టాలని, నిబంధనలు పాటించకుండా నడిపే వాహనదారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీటీసీ అధికారి మురళీధర్, వికారాబాద్, పరిగి, తాండూరు డీఎస్పీలు, ఆర్టీఏ అధికారులు, ఆర్టీసీ అధికారులు, డీసీఆర్బీ, డీఎస్బీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.