సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మం జూరైన ఇండ్ల జాబితాల్లో తమ పేర్లు వచ్చినా ఇందిరమ్మ ఇంటి కోసం మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారని వాపోతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప లు ప్రాంతాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించి తమను ఎంపిక చేసిందని ఆ ఇండ్లనే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
32 వేల మందికి మొండి చేయి
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలోని నలుమూలలా లక్ష డబుల్ బెడ్ ఇండ్లు నిర్మించారు. దాదాపు 68,000 మందికి పట్టాలు పంపిణీ చేశారు. మిగిలిన 32,000 ఇండ్లకు సంబంధించి అర్హులకు ఇం డ్లు మంజూరైనట్లు ధ్రవీకరణతోపాటు లబ్ధిదారుల జాబితాను విడుదల చేశారు. పట్టాలు పంపిణీ చేసే సమయానికి శాసనసభ ఎన్నికల కోడ్ రావడంతో ఆపేశారు. ఆ జాబితాలో పేరు వచ్చిన వారు తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తమ గోడును పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ మళ్లీ గెలిచి ఉంటే తమకు ఇప్పటికే ఇండ్లు కేటాయించే వారని పేర్కొంటున్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం అర్జీలు తీసుకోవడమే తప్ప.. ఇండ్లిస్తామనే భరోసా మాత్రం ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు.
15 నెలలుగా కాలయాపన
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 15 నెలలు కావొస్తున్నా ఒక్క పథకంపైనా స్పష్టత లేకపోవడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఏడాది నుంచి దరఖాస్తుల పేరిట కాలయాప న చేస్తూ.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని మండిపడుతున్నారు. దరఖాస్తుల పేరిట రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడమే కానీ..పథకాలు అమలైన దాఖలాల్లేవని నిట్టూరుస్తున్నారు.
ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది
25 ఏండ్లుగా ఖాద్రీబాగ్లో ఉంటున్నా. కేసీఆర్ కట్టిచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లు మం జూరైన లిస్టులో నా పేరు ఉన్నది. అయితే ఇండ్ల పంపిణీ సమయంలో ఎన్నికల కోడ్ రా వడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కేసీఆర్ సార్ మళ్లీ సీఎం అయి ఉంటే నాకు ఇల్లొచ్చే ది. కాంగ్రెస్ సర్కారు కు ఇప్పటికే 3 సార్లు దరఖాస్తు చేసుకున్నా. కానీ ఇల్లిస్తమని గ్యారెంటీగా చెబ్తలేరు.
– ఆంగోత్ తులసి, ఖాద్రీబాగ్, అంబర్పేట