కడ్తాల్ : పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు లభిస్తాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో మండల టీఆర్ఎస్ అనుబంధ కమిటీల అధ్యక్షులను ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల మహిళ విభాగం అధ్యక్షురాలిగా కాసోజు వాణీశ్రీ, యువజన విభాగం అధ్యక్షుడిగా గుర్కా రాజేందర్యాదవ్, ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడిగా ఈర్లపల్లి మహేశ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా జర్పుల శంకర్నాయక్, బీసీ సెల్ అధ్యక్షుడిగా లక్ష్మీదేవి నర్సింహాగౌడ్, రైతు విభాగం అధ్యక్షుడిగా నేనావత్ పంత్యానాయక్, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మహ్మద్ ఇర్షాద్, కార్మిక విభాగం అధ్యక్షుడిగా కాలే రమేశ్, మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా సిద్ధమోని నరేశ్గౌడ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన మండల, గ్రామాల, వివిధ విభాగాల కార్యవర్గ సభ్యులు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, మండల అధ్యక్షుడు కంబాల పరమేశ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్లు సులోచన, భాగ్యమ్మ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, నాయకులు సాయిలు, జంగయ్యగౌడ్, మహేశ్యాదవ్, భాస్కర్, జగన్, మురళీ పాల్గొన్నారు.