మర్పల్లి, జనవరి 27: రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సిరిపురంలో ‘మీతోనేను’ కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ లలిత, జడ్పీటీసీ మధుకర్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ భూమి విస్తీర్ణం ప్రకారం సిరిపురం, వీర్లపల్లి గ్రామాలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవ సాయ శాఖ అధికారులకు సూచించారు. గ్రామంలో పాడు బడిన ఇండ్లను, పెంట కుప్ప లు, కలుపు మొక్కలను తొలగించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు.. విద్యుత్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
ఒక్క సిరిపురం గ్రామానికే రైతు బంధు పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.18 కోట్లు రైతులకు అం దించామన్నారు. అదే విధంగా 30 మంది రైతులు వివిధ కారణాలతో మరణించగా వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున కోటి యాబై లక్షల బీమా డబ్బులు అందించినట్లు గుర్తు చేశారు. గ్రామంలో 504 మందికి వివిధ రకాల పింఛన్ల డబ్బులు ప్రతి నెలా అందజేస్తున్నట్లు తెలిపారు.. గ్రామాభివృద్ధికి రూ.10 లక్షలు మంజూరు చేస్తు న్నట్లు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లయ్య, వైస్ ఎంపీపీ మోహ న్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీ మల్లేశం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, ఉపాధ్యక్షుడు అశోక్, ప్రధానకార్యదర్శి రాచయ్య, యూత్ అధ్యక్షుడు మధుకర్, నాయకులు రాచన్న, కృష్ణ, ఖాజా, జైహింద్రెడ్డి, మిత్ర, ఆయా గ్రా మాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.