తాండూరు, సెప్టెంబర్ 9: బీఆర్ఎస్ తాండూరు అసెంబ్లీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్రెడ్డికి కేటాయించడం, తెలంగాణలో రెండోసారి మం త్రిగా మహేందర్రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో పా టు తాండూరులో బీఆర్ఎస్ను ఏకతాటిపైకి తీ సుకొచ్చిన ఎంపీ రంజిత్రెడ్డికి శనివారం తాం డూరు నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్త్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అడుగడుగునా గజమాల, పూలమాలలతో మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డిని సన్మానిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఖాంజాపూర్ గేటు నుంచి ప్రారంభమైన బీఆర్ఎస్ ర్యాలీ విలేమూన్ చౌరాస్తా, పోలీస్ స్టేషన్, శాంత్మహాల్ థియోటర్, రేల్వే స్టేషన్ వరకు జనసంద్రంగా కొనసాగింది.
ర్యాలీలో జై తెలంగాణ.. జైజై బీఆర్ఎస్ అంటూ పాకీంట శ్రేణుల నినాదా లు హోరెత్తాయి. ఈ సందర్భంగా మంత్రి మ హేందర్రెడ్డి మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పని చేసిన వారికి పదవులు వస్తాయన్నారు. తాండూ రు ఎమ్మెల్యే టికెట్ రోహిత్రెడ్డికి దగ్గర ఉండి ఇప్పించామని ఇందులో ఎవరూ అనుమానం చెందాల్సిన అవసరం లేదన్నారు. రోహిత్రెడ్డిని దగ్గర ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత తమదేనని తెలిపారు. అందుకు తగ్గట్టు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామన్నారు.
బీఆర్ఎస్ వార్ వన్ సైడ్
ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నిక ల్లో నిలబడేందుకు కాంగ్రెస్, బీజేపీకి ఎవరూ ముందుకు రాకపోవడం విడ్డూరంగా ఉందన్నా రు. బీఆర్ఎస్ వా ర్ వన్ సైడ్ ఉంటుందన్నారు. రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని, మహేందర్రెడ్డి మంత్రి అవుతారని, రోహిత్రెడ్డి ఎమ్మెల్యే కావడం ఖాయమన్నారు.
మీ అభిమానం.. ఆప్యాయతతో..
ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ తాండూరు బిడ్డగా ప్రజలు చూపిస్తున్న అభిమానం, అప్యాయతతో పాటు మంత్రి మహేందర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి ఆశీర్వాదంతో తాండూరు ఎమ్మెల్యే టికెట్ సీఎం కేసీఆర్ తనకు ఇచ్చారన్నారు. ని యోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలు తమ కు మద్ధతు తెలుపుతూ బీఆర్ఎస్కు ఓటు వేసి గె లిపించాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజూగౌడ్, రాష్ట్ర నాయకులు పురుషోత్తంరావు, శ్రీశైల్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.