ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు నూతనంగా ఎన్నికైనా యువజన సంఘాలు, విద్యార్థి సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సభ్యులు కష్టపడి పని చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి నూతనంగా ఎన్నికైనా టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు జెర్కోని రాజు, ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు జగదీశ్, ప్రధాన కార్యదర్శి మైలారం విజయ్కుమార్లతో పాటు సభ్యులను బుధవారం ఎమ్మెల్యే కిషన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు ప్రతిక్షణం కష్టపడి పని చేయాలన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనా సభ్యులు ఎమ్మెల్యే కిషన్రెడ్డి, రాష్ట్ర నాయకులు ప్రశాంత్కుమార్రెడ్డి, ఎంపీపీ కృపేష్లతో పాటు పలువురిని శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్, టీఆర్ఎస్ యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.