గ్రామాలే రాష్ట్ర అభివృద్ధికి పట్టుగొమ్మలు.. పల్లెలు బాగుపడినప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని సంకల్పించిన సీఎం కేసీఆర్ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించేందుకు ‘పల్లె ప్రగతి’ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ప్రత్యేక నిధులను కేటాయిస్తూ గ్రామాలను పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
పల్లె ప్రగతితో రంగారెడ్డి జిల్లాలోని గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయి. జిల్లాలో మొత్తం 558 గ్రామ పంచాయతీలున్నాయి. పల్లె ప్రగతి కింద ప్రభుత్వం జీపీలకు ప్రతి నెలా రూ.18కోట్ల చొప్పున నిధులను విడుదల చేస్తుండగా.. ఇప్పటివరకు జిల్లాకు మొత్తం రూ.317 కోట్లు అందాయి. పుష్కలంగా నిధులు ఉండడంతో ప్రగతి పనులను పకడ్బందీగా చేపడుతూ వస్తున్నారు. గ్రామానికో ట్రాక్టర్ అందజేసి చెత్త సేకరణ, మొక్కలకు నీరు అందిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఏ పల్లెకెళ్లినా.. ఏ వీధికెళ్లినా.. ఏపుగా పెరిగిన చెట్లు, పరిశుభ్రతే కనిపిస్తున్నది. ప్రతి ఊరులో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం, రహదారికి ఇరువైపులా నాటిన పచ్చని మొక్కలు ఆహ్లాదం పంచుతున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా ఊరూరా డంపింగ్యార్డు, వైకుంఠధామం, సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించారు. దాదాపుగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు ప్రజలకు అందుబాటులోకి రావడంతో ఇక్కట్లు తీరాయి.
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 10: దళితుల జీవితాల్లో వెలుగు నింపడంతోపాటు సమానత్వం తీసుకు రావడమే ఏకైక లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు. పాలకులు దళితులను ఓటుబ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశారని, వారి స్థితిగతులను మార్చాలని, వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని భావించిన సీఎం కేసీఆర్ దళితబంధును ప్రవేశపెట్టారని అన్నారు. నియోజకవర్గంలో మొదటి విడుతలో వందమంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. మొదటి విడుతలో ఎంపిక చేసే అభ్యర్థుల కోసం ప్రతి గ్రామం నుంచి పది మంది పేదవారి వివరాలను తీసుకుంటామని, అలాగే మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డు నుంచి ఐదుగురి చొప్పున జాబితాను తీసుకుని వారిలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. విడుతల వారీగా ప్రతి దళితుడికీ లబ్ధి చేకూరుతుందన్నారు.100 శాతం గ్రాంటుతో రూ.10 లక్షలు అందజేసి లబ్ధిదారులు తమకు నచ్చిన యూనిట్ను నెలకొల్పుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు.
ఎమ్మెల్యే : లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా సాగుతుంది. అర్హులను ఎంపిక చేస్తాం. ప్రతి గ్రామం నుంచి పది మంది పేద దళితుల పేర్లు, ప్రతి మున్సిపల్ లో వార్డుకు ఐదుగురి చొప్పున పేర్లను తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేస్తు న్నాం. ఈ ఆర్థిక సహాయంతో వారి జీవితాల్లో వెలుగులు నింపేలా చర్యలు తీసుకుంటున్నాం.
ఎమ్మెల్యే : లబ్ధిదారులు తమకు ఇష్టమైన వ్యాపారాన్ని ఎంచుకుని ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉపాధి అవకాశాలుంటాయి. అందుకు అనుగుణంగా లబ్ధిదారులు తమ వ్యాపారాన్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా ట్రాక్టర్లు, ఆటోమొబైల్స్, చికెన్సెంటర్లు, కిరాణా షాపు లు, హోటళ్లు, టిఫిన్సెంటర్లు, కంప్యూటర్ సెంటర్లు, సెంట్రింగ్ బాక్సులు, మెడికల్ షాపులు, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. మహిళలు కుట్టుమిషన్లు, మ్యాచింగ్ సెంటర్లు, బ్యూటీపార్లర్లను ఎంచుకుని ఆర్థికంగా ఎదుగొచ్చు.
ఎమ్మెల్యే : నేను గత 40 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ఇలాంటి పథకాన్ని ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదు. గత పాలకు లు దళితులను ఓటు బ్యాంకుగానే చూసేవారు. వారికి ఎస్సీ కార్పొరేషన్ స్కీం క్రింద రూ.ఐదు నుంచి రూ. పదివేలు ఇచ్చి చేతులు దులుపుకొనేవారు. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి నాణ్యతలేని ఇండ్లను కట్టించేవారు. అందువల్లే దళితులు నేటికీ పేదరికంలోనే మగ్గుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు.
ఎమ్మెల్యే : ఒక సాధారణ దళిత కుటుంబం రూ. పది లక్షలను సంపాదించటం ఎంతో కష్టమైనది. వారు ఎంత కష్టపడినా తమ జీవిత కాలంలో సంపాదించే పరిస్థితి లేదు. ఇలాంటి వారంద రూ ఈ పథకం క్రింద అభివృద్ధి చెందేలా ప్రభుత్వం వారికి అం డగా నిలవడం సంతోషకరం. వందకు వందశాతం రాయితీతో రూ.పదిలక్షలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. లబ్ధిదారులు తాము అభివృద్ధి చెందడం తోపాటు మరో పది మందికి ఉపాధి కల్పించాలి. అదేవిధంగా
మొదటి విడుతలో వందమందిని ఎంపిక చేస్తాం. రెండో విడుత లో మరింత ఎక్కువ మందికి ఈ పథకం క్రింద ఆర్థిక సాయం అందేలా చేస్తాం. ముఖ్యంగా అంబేద్కర్ కలలుగన్న సమానత్వం తీసుకు రావాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఎమ్మెల్యే : దళితబంధు పథకంతో లబ్ధిదారుడు తాను ఎంపిక చేసుకున్న యూనిట్ల ద్వారా చేసే వ్యాపారంలో ఏమైనా నష్టం జరిగితే ఆపత్కాలంలో దళిత రక్షణనిధి ఆదుకుంటుం ది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు కేటాయించే రూ.10లక్షల నుంచి రూ.10వేలను దళిత నిధికి కేటాయించి రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. రక్షణ నిధి ఆయా కుటుంబాలకు ఎంతో ఆర్థిక ధీమానిస్తుంది. ప్రభుత్వ ఆదేశాలతోపాటు స్థానిక అవసరాలను కూ డా పరిగణలోకి తీసుకుని దళితబంధు పథకాన్ని అమలుచేస్తాం. ప్రభుత్వం దళితుల మేలును కాంక్షించి ఒక్కో లబ్ధిదారుడికి రూ.పది లక్షలను మంజూరు చేస్తున్నది. ఈ మొత్తం లబ్ధిదారుల కుటుంబాలకు చేరాలి. వారు ఆర్థికంగా ఎదుగడంతోపాటు పదిమందికి ఉపాధి కల్పించాలి.