కొందుర్గు, ఫిబ్రవరి 9 : మారుమూల గ్రామాలను సైతం పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం జిల్లెడు చౌదరిగూడ మండలంలోని వనంపల్లి, చౌదరిగూడ, జిల్లెడు, పద్మారం, వీరన్నపేట, పెద్ద ఎల్కిచర్ల, ముష్టిపల్లి, చేగిరెడ్డి ఘనాపూర్, ఎదిర, పీర్జాపూర్, జాకారం గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో గ్రామాలను సుందరంగా మార్చుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బంగారు స్వరూప, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్. సర్పంచ్లు బాబురావు, వెంకటస్వామి, శివమౌళి, బాల్రాజు, రాణి, లక్ష్మీసుధ, నాయకులు మోత్యానాయక్, కృష్ణయ్య, రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు రూరల్ : కళాకారులకు ప్రభుత్వం చేయూతనిస్తున్నదని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలోని వీరాంజనేయ భజన మండలి ఆధ్వర్యంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర నాటక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే స్వయంగా పాటను ఆలపించి నాటక ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విజ్ఞాన ప్రపంచంలో ప్రజలు డిజిటల్ బొమ్మలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారని, సినిమాలు, స్మార్ట్ ఫోన్లపై ఆసక్తిని చూపుతుండటంతో నాటకాలకు ఆదరణ లభించటం లేదన్నారు. నాటక ప్రదర్శనలో ఎమ్మెల్యే ఆలపించిన పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ రవీందర్, మాజీ ఎంపీటీసీ దేవేందర్, కౌన్సిలర్ శ్రీను, నాయకులు జనార్దన్చారి, యాదయ్య, బాలరాజు, నిర్వాహకులు దర్శన్చారి, అంజయ్య, బాలరాజు పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీకి చెందిన హరీశ్కు, సోలిపూర్ గ్రామానికి చెందిన పుష్పమ్మకు, బీవీరావునగర్కాలనీ చెందిన శ్రీనివాస్రావుకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్ నర్సింహ, కృష్ణవేణి, నాయకులు రఘునాథ్యాదవ్, చీపిరి రమేశ్యాదవ్ పాల్గొన్నారు.