పరిగి టౌన్, మే 13 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై యువకుడు మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన శేఖర్రెడ్డి పరిగి మండల పరిధిలోని లక్ష్మిదేవిపల్లిలో కోళ్లఫారమ్ లీజుకు తీసుకొని కొనసాగిస్తున్నాడు.
అతని వద్ద పర్వతాపూర్ గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు పనిచేసేవాడు. గురువారం రాత్రి కోళ్లఫారమ్లో ప్రమాదవశాత్తు ఎర్తింగ్వైర్ తగిలి మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.