పరిగి, జూన్ 8 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాల అమలవుతున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. బుధవారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశపు హాలులో మండలంలోని 90 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో ఏ సంక్షేమ పథకం కింద లబ్ధి చేకూరాలన్నా పైరవీలు చేయాల్సి వచ్చేదని, పైసలు ఇవ్వనిదే పని అయ్యేది కాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నేరుగా రూపాయి ఖర్చు లేకుండానే పని జరుగుతుందన్నారు.
పేదలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.