వికారాబాద్ : వికారాబాద్ వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని బీటీఎస్ కాలనీలో రథతోత్సవం కన్నుల పండువగా సాగింది. ఇందులో మహిళలు కోలాటాలు ఆడుతూ ఊరేగింపు నిర్వహించారు. స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజాలు చేశారు. రథోత్సవంలో భాగంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ స్వామివారికి పూజలు చేసి, రథోత్సవంలో పాల్గొని కోలాటం ఆడారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.