వికారాబాద్ : వికారాబాద్కు రింగ్ రోడ్ కావాలని శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహాకారంతో వికారాబాద్ జిల్లాగా మారిందన్నారు. ప్రస్తుతం వికారాబాద్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, వికారాబాద్కు రింగ్ రోడ్ వస్తే కొంత మేరకు ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని మంత్రి నోట్ చేసుకున్నట్లు తెలిపారు.