దోమ : కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరం వంటిదని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఎంపీపీ అనుసూయతో కలిసి 67మంది లబ్ధిదారులకు రూ. 67,07,772ల విలువగల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తుదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నాగిరెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజీరెడ్డి, గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్యగౌడ్, రైతుబంధు అధ్యక్షుడు లక్ష్మయ్యముదిరాజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్గౌడ్, ఎంపీడీవో జయరాం, డిప్యూటీ తాసిల్దార్ రాజేందర్రెడ్డి, ఆర్ఐ లింగం, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.