షాబాద్, జనవరి 25 : సమాజంలో ఓటు హక్కు ఒక ఆయుధం లాంటిదని తహసీల్దార్ అమరలింగంగౌడ్ అన్నారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ఓటు హక్కును స్వచ్ఛందంగా ఉపయోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్ను నిర్ణయించేది యువ ఓటర్లేనని, ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ క్రాంతికిరణ్, సిబ్బంది తదితరులున్నారు.
హయత్నగర్ రూరల్ : ప్రతి ఒక్కరు విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంపీపీ బుర్ర రేఖ, జడ్పీటీసీ బింగి దాసుగౌడ్ అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో సర్పంచ్ ముద్దం స్వరూప, ఎంపీటీసీ భాస్కర్గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మమతబాయి, నాయకులు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
యాచారం : 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎంపీపీ సుకన్య మాట్లాడుతూ 62వ రాజ్యాంగ సవరణ ద్వారా వయోజనులకు ఓటు హక్కు కల్పించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీటీసీ లక్ష్మిపతి, సిబ్బంది పాల్గొన్నారు.
కడ్తాల్ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు నమోదు చేసుకోవాలని నాయకులు, అధికారులు అన్నారు. మండల కేంద్రంతోపాటు పరిధిలోని ఆయా గ్రామాల్లో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. రెవెన్యూ అధికారులు ఓటు ప్రాముఖ్యతను యువకులకు వివరించారు.
ఆమనగల్లు : ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలని తహసీల్దార్ పాండునాయక్ అన్నారు. తహసీల్దార్ కార్యాలయం ఓటర్ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ అనిత, ఎంపీడీవో వెంకట్రాములు, సీఐ ఉపేందర్రావు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ ధర్మేశ్, నాయకులు జంగయ్య, విజయ్, మల్లయ్య పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్మెట్ : జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజాప్రతినిధులు, ఓటర్లు ప్రతిజ్ఞ చేశారు. ఓటు హక్కును యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వీఆర్వోలు ముత్యాలు, దశరథ, కవిత, హైమావతి, మల్లిక, జ్యోతి, కల్పన, శ్రావణ్ తదితరులు ఉన్నారు.
అర్హులు ఓటు నమోదు చేసుకోవాలి
కొత్తూరు : అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వీరేందర్ అన్నారు. కొత్తూరు మున్సిపల్ కార్యాయలం వద్ద జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్, మాజీ ఎంపీటీసీ యాదయ్య, కమ్మరి జనార్దన్, కుమ్మరిగూడెం మహేశ్గౌడ్, బండి శ్రవణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
నందిగామ : ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని ఎంపీపీ ప్రియాంక అన్నారు. మండల పరిషత్ కా ర్యాలయంలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భం గా ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, కుమారస్వామి, ఎంపీడీవో బాల్రెడ్డి, ఏపీఎం యాదగిరి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కేశంపేట : మండలంలోని కొత్తపేట ప్రభుత్వ పాఠశాలలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు జాతీయ ఓటరరు దినోత్సవాన్ని నిర్వహించారు.కార్యక్రమంలో సర్పంచ్ నవీన్కుమార్, ఎంపీటీసీ మల్లేశ్యాదవ్, కో ఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, పంచాయతీ కార్యదర్శి మల్లేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : ఓటు హక్కు ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కు అని తహసీల్దార్ అనిత అన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీటీ తాజావుద్దీన్, ఆర్ఐలు చంద్రమోహన్, పాండుగౌడ్, వీఆర్వోలు మహాలక్ష్మి, సరిత ఉన్నారు.