పరిగి, జనవరి 25: 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేయించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల కోరారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువత మొబైల్ యాప్, ఆన్లైన్ ద్వారా ఓటరు సేవలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. యాప్ ద్వారా ఓట రుగా నమోదు, ఎపిక్ కార్డులో చిరునామా మార్పు, సవరణలు చేసుకోవచ్చని చెప్పారు. ఓటుహక్కు వజ్రాయుధం లాంటిదని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కులం, మతం, వర్గం, జాతి విభేదాలు లేకుండా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు అవగాహన పెంపొందించడానికి ఓటరు దినోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో జిల్లా కలెక్టర్ నిఖిల ప్ర తిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీ లాల్, స్వీప్ నోడల్ ఆఫీసర్ కోటాజీ, పరిపాలన అధికారి హరి త, ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీధర్, అధికారులు పాల్గొన్నారు.