వికారాబాద్, జనవరి 25 : డీపీవో కార్యాలయ అధికారులు పోలీస్ శాఖకు గుండెకాయలాంటివారని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీపీవో కార్యాలయ అధికారులతో కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అధికారులు సిబ్బందితో స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతీ నెల డీపీవో కార్యాలయంలో పని చేసే అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రషీద్, ఏఆర్డీఎస్పీ సత్యనారాయణ, ఏవో అమర్నాథ్, డీఎస్బీ అధికారులు నాగేశ్వర్, శ్రీనివాస్, ఆర్ఐలు భరత్భూషణ్, అచ్యుతరావు, రత్నం, సూపరింటెండెంట్లు శివకుమార్, మొనప్ప, జావిద్, అధికారులు పాల్గొన్నారు.
బంట్వారం/కోట్పల్లి, జనవరి 25 : పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన అకస్మికంగా కోట్పల్లి, బంట్వారం పోలీస్స్టేషన్లను సందర్శించి పరిశీలించారు. స్థానిక సిబ్బందితో టర్న్ ఔట్ చేసి, పోలీస్స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. కొవిడ్ నేపథ్యంలో తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. అనంతరం పోలీస్స్టేషన్ రికార్డులను పరిశీలించారు. మంచి పనితనం కనబరిచిన సిబ్బందికి ప్రతి నెలా రివార్డులు అందిస్తామని చెప్పారు.